Breaking News

Monthly Archives: February 2025

భవిష్య సవాళ్లను సైతం ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయాలి

-పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి I.A.S., విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులను సిద్ధం చేయడం మన బాధ్యత అని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు. వి I.A.S., అన్నారు. మంగళవారం పాఠశాల విద్యా శాఖ, ప్రభుత్వ పరీక్షల విభాగం సహకారంతో పరఖ్ (PARAKH: Performance Assessment, Review, and Analysis of Knowledge for Holistic Development) ఆధ్వర్యంలో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు (HPCs), ప్రామాణిక ప్రశ్నాపత్రాల నమూనాలు సిద్ధం …

Read More »

మ‌హా శివ‌రాత్రి పుణ్య స్నానాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు..

– భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా సీనియ‌ర్ అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ – ఘాట్లలో జ‌ల్లు స్నానాలు, డ్రెస్ ఛేంజింగ్ రూమ్‌ల ఏర్పాటు – ఎన్‌టీర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 26న మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా పెద్దసంఖ్య‌లో భ‌క్తులు కృష్ణాన‌దిలో పుణ్య స్నానాలు ఆచ‌రించి, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల‌ను ద‌ర్శించుకోనున్న నేప‌థ్యంలో ఆల‌యంతో పాటు ముఖ్య ప్రాంతాల్లో ప‌టిష్ట ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం తెలిపారు. శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానం అధికారుల‌తో …

Read More »

ఎమ్మెల్సీ పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న కృష్ణా-గుంటూరు జిల్లాల శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా ఓటు హ‌క్కు ఉన్న కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ లీవ్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రకటించిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ మంగ‌ళ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 …

Read More »

ఈవీఎం గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

– పోలీసు సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు ప‌టిష్ట భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేయ‌డం జ‌రిగింద‌ని.. పోలీసు సిబ్బంది 24X7 అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడిలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారులు, రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ప‌రిశీలించారు. సీసీ కెమెరాల ప‌నితీరు, అగ్నిమాపక దళ పరికరాలు త‌దిత‌రాల‌ను ప‌రిశీలించారు. అనంతరం …

Read More »

మహా శివరాత్రి సందర్బంగా యోగ శక్తి చికిత్స “నాడీ శోధన”తో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ… : డా. మాకాల సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాడీ శోధనతో ఆరోగ్య సమస్యలు నిర్ధారణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చునని యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. మనలో నాడీ అనేది సృష్టికర్త ద్వారా మనలో ఏర్పాటు చేయబడి మన 12 అవయవాల పనితీరు లో హెచ్చుతగ్గులు కనిపెట్టి ఆరోగ్యాన్ని ఇచ్చే విధానం భారతదేశంలో వేల సంవత్సరాలుగా వాడబడినది అని దీనిని యోగ, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యంలో వాడుతున్నారని, …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో 100 రోబోటిక్-సహాయక యూరాలజికల్ సర్జరీలను పూర్తి చేసిన మొదటి ఆసుపత్రి- ప్రశాంత్ హాస్పిటల్

-ఈ 100 రోబోటిక్-సహాయక సర్జరీలలో, 40 సర్జరీలలో ‘రోబోట్‘ సహాయంతో కిడ్నీ లేదా మూత్రపిండాల లో కొంత భాగాన్ని మాత్రమే తోలిగంచడం (పాక్షిక నెఫ్రెక్టమీ) ద్వారా కిడ్నీ పనితీరును కాపాడటానికి కి దోహదపడ్డాయి, దీని వలన రోగి కి ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయి -విభిన్న వర్గాలకు చెందిన రోగులకు యూరాలజికల్ సర్జరీల కోసం అధునాతన రోబోటిక్ టెక్నాలజీని అందించే ఏకైక ఆసుపత్రి ప్రశాంత్ హాస్పిటల్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ యూరాలజీ ఆసుపత్రులలో ఒకటైన ప్రశాంత్ హాస్పిటల్, 100 …

Read More »

ఈ నెల 27,28 తేదీల్లో బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని బిఆర్ స్టేడియం రిజర్వాయర్ పరిధిలోని త్రాగునీటి సరఫరా జరిగే పాత 600ఎంఎం డయా ఔట్లెట్ ఆర్సీసి డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్ మరమత్తు పనులను ఈ నెల 27(గురువారం) ఉదయం సరఫరా అనంతరం చేపట్టడానికి జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారని, పనుల వలన 27 (గురువారం) సాయంత్రం నుండి 28 (శుక్రవారం) వరకు త్రాగునీటి సరఫరాలో అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు …

Read More »

నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రధానంగా మౌలిక వసతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్  స్పష్టం చేశారు. మంగళవారం అడవితక్కెల్లపాడు రాజీవ్ గృహకల్ప సముదాయం, స్వర్ణభారతి నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అడవితక్కెళ్ళపాడు రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని పరిశీలించి, పారిశుధ్య …

Read More »

పోలింగ్ సిబ్బందికి సక్రమంగా అందించేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గానికి జరిగే ఎన్నికలకు సంబంధించి స్థానిక ఏ.సి కళాశాలలో రిసెప్షన్ సెంటర్లు , డిస్ట్రిబ్యూషన్ సెంటర్ , కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ్ తేజ , తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహా లతో కలసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు. ఫిబ్రవరి 26 వ తేదీన పోలింగ్ …

Read More »

ఎన్నికల ఏర్పాట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా, ప్రశాతంగా జరిగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా సిధ్దం చేశామని రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లొని డీఆర్సీ హాలులో రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి తో కలసి ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలపై మీడియా …

Read More »