Breaking News

Monthly Archives: February 2025

ఎన్నికల ఓటింగ్ పారదర్శకంగా సజావుగా జరిగేలా చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓటింగ్ పారదర్శకంగా, ప్రశాంత వాతావారణంలో సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు పటిష్టంగా చేపట్టాలని ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సాధారణ అభ్జర్వర్ వి కరుణ ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోకవర్గ పరిధిలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల సాధారణ అభ్జర్వర్ వి …

Read More »

పోలింగ్ ఏజెంట్ల‌కు ఎంపి కేశినేని శివ‌నాథ్ దిశా నిర్దేశం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీన జ‌రిగే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల‌కు ఎన్డీయే కూట‌మి ప‌శ్చిమ‌నియోజ‌క‌వ‌ర్గంలో పోలింగ్ ఏజెంట్స్ ను నియ‌మించింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం విద్యాధ‌ర‌పురంలోని ఆర్య‌వైశ్య కార్పొరేష‌న్ చైర్మ‌న్ డూండీ రాకేష్ కార్యాల‌యంలో పోలింగ్ ఏజెంట్స్ తో ఎంపి కేశినేని శివ‌నాథ్ స‌మావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మూడు పోలింగ్ కేంద్రాల ప‌రిధిలో 15 పోలింగ్ బూత్ లు వున్నాయ‌న్నారు. పోలింగ్ ఏజెంట్స్ విధివిధానాలు …

Read More »

స‌మ‌గ్ర గ్రామీణాభివృద్ధి కోసం పంచాయ‌తీ ఛాంపియ‌న్స్ కృషి చేయాలి

-పంచాయతీ ఛాంపియ‌న్స్ కు ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) దిశా నిర్దేశం విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల‌పై అవ‌గాహ‌న క‌లిగించ‌టం తోపాటు, మ‌హిళా స్వ‌యం స‌హాయక సంఘాల‌కు కుటీర ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చే అనేక ప‌థ‌కాలు వివ‌రించ‌టంతోపాటు, ప్ర‌జ‌ల‌కు తాగునీరు, రైతులకు సాగు నీరు స‌మస్య‌లు రాకుండా ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్ర‌తి ఇంటికి చేరేలా చూడాల‌ని పంచాయతీ ఛాంపియ‌న్స్ కి ఎంపి …

Read More »

స‌మ‌స్యల‌ ప‌రిష్కారం కోసం కృషి చేసే నాయ‌కుడ్ని గెలిపించాలి : ఎంపి కేశినేని శివనాథ్

-ఎమ్మెల్సీ అభ్య‌ర్ధి ఆల‌పాటి విజ‌యాన్ని కాంక్షిస్తూ ఎన్నిక‌ల ప్ర‌చారం -ఉపాధ్యాయుల‌తో స‌మావేశమైన ఎన్డీయే నాయ‌కులు విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏడు నెలల క్రితం ప్ర‌జ‌లంద‌రీ ఓటు పవర్ తో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మరోసారి ప‌ట్ట‌భ‌ధ్రులు ఓటు పవర్ చూపించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేసే నాయ‌కుల్ని కాకుండా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం కృషి చేసే ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను భారీ మెజార్టీతో గెలిపించాల‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ ఉపాద్యాయుల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఉమ్మడి …

Read More »

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీదుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వపరంగా చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం కలెక్టరేట్ నుండి ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఫైర్, లేబర్ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్నాయన్నారు. …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శాసనమండలి పట్టబద్రుల ఎన్నికల ప్రక్రియ విజయవంతానికి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఈనెల 27వ తేదీన జిల్లాలో నిర్వహించే కృష్ణ- గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన నిర్వహించే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. …

Read More »

శాసనమండలి పోలింగ్ రోజున స్పెష‌ల్ క్యాజువ‌ల్ లీవ్‌

-ఎన్నికల పోలింగ్ కు ఏర్పాటుచేసిన 77 పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలకు ఈ నెల 26, 27 రెండు రోజులు సెలవు దినాలుగా ప్రకటించాం… -ప‌ట్ట‌భ‌ద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్ర‌త్యేక అవ‌కాశం: క‌లెక్ట‌ర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 27న శాస‌న మండ‌లి ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ రోజు ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు వీలుగా జిల్లాలో ఓటు హ‌క్కు కలిగిన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స్పెషల్ క్యాజువల్ …

Read More »

రిల‌య‌న్స్ సీబీజీ ప్లాంట్ల నిర్మాణ ప్ర‌క్రియ‌ వేగ‌వంతం చేయాలి

-భూ కేటాయింపులు, మౌలిక వ‌స‌తుల ఏర్పాటుపై మంత్రి సమీక్ష -ప్లాంట్ల ఏర్పాటుకు పూర్తి స‌హ‌కారం అందిస్తాం -సీబీజీ ప్లాంట్ల నిర్మాణంతో 2.5 ల‌క్ష‌ల మందికి ఉపాధి అవ‌కాశాలు -బంజర భూముల్లో సీబీజీ ప్లాంట్లు ఏర్పాటుతో రైతులకు అదనపు ఆదాయం -స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు మ‌రిన్ని పెట్టుబ‌డులు -సీబీజీ ప్లాంట్ల‌పై మంత్రి గొట్టిపాటి స‌మీక్ష‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ఏర్పాటు చేయ‌బోయే 500 కంప్రెస్ట్ బ‌యో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల నిర్మాణ …

Read More »

27 వ తారీఖున స్థానిక ప్రజలకొరకు పూర్తి ఉచిత దర్శన సౌకర్యం

-విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ కనువిందు చేస్తుంది  -దేవాదాయ మరియు ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రిమాట్లాడుతూ ….శ్రీకాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబిక సమేత కాళహస్తీశ్వర స్వామిని దర్శించి ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కాళహస్తి శాసనసభ్యులు చలో సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, దేవాదాయశాఖ కమిషనర్, ఈవో, కూటమి ప్రభుత్వం నాయకులతో కలిసి పట్టు …

Read More »

శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామికి ప్రభుత్వం తరపున పట్టువస్త్ర సమర్పణ

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వైభవంగా జరుగు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి చేరుకున్న దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఆలయ ఈవో బాపిరెడ్డి , దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో …

Read More »