Breaking News

Monthly Archives: February 2025

ఏపీసీఎనీఎఫ్ తో కలిసి పనిచేస్తాం

-ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రశంసించిన జర్మన్ బృంద ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చిన్న ,సన్నకారు రైతులు కూడా వాతావరణ మార్పులకు దోహద పడతారని, ప్రకృతి వ్యవసాయంలో మహిళలు మఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని జర్మన్ ప్రతినిధులు ప్రశంసించారు. గత మూడు రోజులుగా ఆంద్ర ప్రదేశ్ లోని గుంటూరు,కృష్ణా,ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలలో రైతు సాధికార సంస్థ “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం(ఏపీసీఎన్ఎఫ్)” ద్వారా అమలుచేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జర్మన్ ప్రతినిధుల బృందం పరిశీలించింది. ఈ రోజు శుక్రవారం …

Read More »

కబ్జా దారుల పై నమోదు చేయాల్సిన కేసును వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేశారు

-ప్రాథమిక విచారణ నిర్వహించకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. – రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల పై దీని ప్రభావం పడుతుంది. – వక్ఫ్ పరిపాలన యొక్క విశ్వసనీయత సామర్థ్యం దెబ్బతింటాయి. – రాష్ట్ర స్థాయి ల్యాండ్ ప్రొటెక్షన్ కమిటీలో డిజిపి సభ్యులుగా ఉన్నారు. – వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో డిజిపి పాలుపంచుకోవాలి. – తక్షణమే వక్ఫ్ ఇన్స్పెక్టర్ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్ఐఆర్ ను మూసివేయాలి. – షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త …

Read More »

విజయనగరంలోని నృత్య కళాశాల‌ సందర్శన

విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి, విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈరోజు విజయనగరంలోని సంగీత మరియు నృత్య కళాశాల‌ను సందర్శించారు. ఈ కళాశాల దేశంలో ఎంతో గొప్ప చరిత్ర కలిగి ఉందని, పూసపాటి విజయరామ గజపతి రాజు  దీన్ని ప్రారంభించారని, హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు  మొదటి ప్రధానోపాధ్యాయుడిగా, అనంతరం ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈ బాధ్యతలను నిర్వహించారని వారు గుర్తుచేశారు. ఘంటసాల మాస్టారు, …

Read More »

పీఎం సూర్య‌ఘ‌ర్ మండ‌ల ల‌క్ష్యాల‌పై దృష్టిపెట్టండి

– సౌర ఫ‌ల‌కాల ఏర్పాటును వేగ‌వంతం చేయండి – ఎప్ప‌టిక‌ప్పుడు అమ‌లు పురోగ‌తిపై ప్ర‌త్యేకంగా స‌మీక్ష‌ – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న ప‌థ‌కం కింద రిజిస్ట్రేష‌న్ల‌తో పాటు సౌర ఫ‌ల‌కాల ఏర్పాటు (ఇన్‌స్ట‌లేష‌న్‌)పై ప్ర‌తి మండ‌లానికి నిర్దేశించిన ల‌క్ష్యాల‌పై అధికారులు దృష్టిసారించాల‌ని, ప‌థ‌కం అమ‌లు పురోగ‌తిపై ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌త్యేకంగా స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ స్ప‌ష్టం చేశారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ క‌లెక్ట‌రేట్ శ్రీ …

Read More »

హోట‌ళ్ల స్వ‌చ్ఛ‌తా ప్ర‌మాణాల‌కు గ్రీన్ లీఫ్ రేటింగ్‌

– లాడ్జిలు, ఇత‌ర ఆతిథ్య సౌక‌ర్యాల‌కూ ర్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ – వ‌న్ లీఫ్‌, త్రీ లీఫ్‌, ఫైవ్ లీఫ్ స్టేట‌స్ ఇచ్చేందుకు కార్యాచ‌ర‌ణ‌ – డివిజ‌న్‌, జిల్లాస్థాయిలో ప్ర‌త్యేక క‌మిటీల ఏర్పాటు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప‌ర్యావ‌ర‌ణ హిత స్వ‌చ్ఛ‌త‌, పారిశుద్ధ్యంలో అత్యుత్త‌మ ప్ర‌మాణాలు పాటిస్తూ ప‌ర్యాట‌కుల‌కు మ‌ధురానుభూతులు మిగిల్చే హోట‌ళ్లు, లాడ్జిలు వంటివాటికి ప్ర‌భుత్వం గ్రీన్ లీఫ్ రేటింగ్ ఇవ్వ‌నుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Read More »

తిరుపతి విమానాశ్రయంలో విజయవంతంగా పూర్తయిన పనులు

-తిరుపతి విమానాశ్రయ డైరెక్టర్ శ్రీనివాస రావు మన్నె రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త : 2025 ఫిబ్రవరి 20న ట్రాన్స్-ఇన్స్టాల్డ్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS), కొత్త డాప్లర్ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఓమ్ని రేంజ్ (DVOR) డిస్టెన్స్ మెజరింగ్ ఎక్విప్మెంట్ (DME)తో పాటు 240 మీటర్ల విమానాశ్రయ రన్ వే పొడిగింపు భాగం కమీషనింగ్ ఎం సురేశ్, మెంబర్ (ANS), వర్చువల్ మోడ్ ద్వారా ప్రారంభోత్సవం చేయగా AAI ఏకే గుప్తా, మెంబర్ (ప్లానింగ్) సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.  ఎంపీ మద్దిల …

Read More »

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సీబీసీ విజయవాడ, పద్మావతి విశ్వవిద్యాలయంతో కలిసి తిరుపతిలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం భాషా వైవిధ్యాన్ని గుర్తించడంతో పాటు భారతీయ జ్ఞాన పరంపరను ప్రోత్సహించడానికి మద్దతుగా నిలిచింది. ఈ సందర్భంగా, పీఐబి, సిబిసిల ఆంధ్రప్రదేశ్ రీజియన్ అదనపు డైరెక్టర్ జనరల్ రాజిందర్ చౌధరి మాట్లాడుతూ, భారతదేశ భాషా వైవిధ్యం “భిన్నత్వం లో ఏకత్వం”కు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సృజనాత్మకతను చాటుకునేందుకు వేవ్స్ 2025 సమ్మిట్‌లో భాగంగా జరుగుతున్న క్రియేటివ్ ఛాలెంజెస్‌లో …

Read More »

ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా (దీపం -2) డెలివరీ చేసినపుడు వినియోగదారుల నుండి బిల్ ధర కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు

-వసూలు చేసినచో కఠిన చర్యలు తప్పవు: జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా (దీపం -2) డెలివరీ చేసినపుడు వినియోగదారుల నుండి బిల్ ధర కన్నా ఎక్కువ వసూలు చేయకూడదనీ, వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలను ఆదేశించారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరము నందు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, …

Read More »

దిగ్విజయంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ, సెంట్రల్ బ్యూరో అఫ్ కమ్యూనికేషన్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, విజయవాడ వారు సంయుక్తంగా సావేరి అతిథి గృహంలో నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యక్షులు ఆచార్య కొలకలూరు మధుజ్యోతి  అధ్యక్షత వహించి సభను నడిపించారు. ఉన్నత విద్య మాతృభాషలో జరిగితే ఉత్తమంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. అప్పారావు కమిటీ నివేదికలో కూడా మాతృభాషా మాధ్యమంలో పరీక్షలు రాయవచ్చు …

Read More »

సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవి… వెల కట్టలేనివి.. వారిని గౌరవ ప్రదంగా చూడాలి

-జిల్లా కలెక్టర్ డా.. వెంకటేశ్వర్ ఎస్. తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సఫాయి కరంచారీల సేవలు అమూల్యమైనవనీ, వెల కట్టలేనివనీ, వారిని గౌరవ ప్రదంగా చూడాలని , వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తో కలిసి నిర్వహించారు. సఫాయి కరంచారీలకు నాణ్యమైన …

Read More »